మహిళలపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి(Kethireddy Venkatarami Reddy) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ సందర్భంగా కేతిరెడ్డి మహిళలను ఉద్దేశించి ‘ఇప్పుడే కదా టిఫిన్లు తిన్నారు.. అప్పుడే అన్నానికి పోతున్నారు. కాసేపు కూడా ఆగలేరా.. అందేకే మన బతులకు ఇట్లున్నాయి’ అని వ్యాఖ్యానించారు. ‘పొద్దున నుంచి సాయంత్రం దాకా నేను, నా భార్య, తమ్ముడు రోడ్ల మీద తిరుగుతున్నాం.. కుటుంబం మొత్తం మీకు చాకిరి చేయడం తప్ప మాకు వేరే పని లేకుండా పోతుంది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంత చేసినా కూడా మా మీద పడి ఏడుస్తున్నారంటూ అసహనం వ్యక్తంచేశారు. అలాగే తనపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నేతలను కూడా డెకాయిట్ నాకొడకల్లారా అంటూ సంబోధించారు. కేతిరెడ్డి వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో ప్రతిపక్షాలు అధికార పార్టీ వైసీపీ నేతలకు మహిళల పట్ల ఉండే గౌరవం ఇదేనంటూ విమర్శలు చేస్తున్నారు.

Latest Articles

భారతీయులు ఉన్న నౌకపై దాడి చేసింది అమెరికానే

24 మంది భారతీయులు ఉన్న నౌకపై దాడి చేసింది అమెరికానే అని ఆ దేశ సెంట్రల్‌ కమాండ్‌ ధృవీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా ఇరాన్‌ పోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడి చేసినట్టు ప్రకటించింది. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్