25.6 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

చార్మినార్, హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో దోపిడి దొంగల బీభత్సం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: సింగరాయకొండ – కావలి రైల్వే రూట్‌లో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ఒకేరోజు రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో దొంగలు(robbers ) దోపిడికి పాల్పడ్డారు. సికింద్రాబాద్ నుండి చెన్నై వెళ్లే హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో( Hyderabad Express) దొంగలు చోరీ చేశారు. ఎస్ 2, ఎస్ 4, ఎస్ 5, ఎస్ 6, ఎస్ 7, ఎస్ 8 బోగీల్లో దోపిడికి పాల్పడ్డారు. ఇదిలా ఉండగానే సికింద్రాబాద్ నుండి తాంబరం వెళ్లే చార్మినార్ ఎక్స్ ప్రెస్‌లో(Charminar Express) సైతం చోరీ జరిగింది. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ ఎస్ 1, ఎస్ 2 బోగీల్లో దొంగలు బీభత్సం సృష్టించారు.

కాగా, అర్థరాత్రి 1.20 నుండి 1.50 నిమిషాల మధ్య ఈ దోపిడీ ఘటనలు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రయాణికులు తెట్టు, కావాలిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్ల దాడి చేసి దుండగులు పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్