జగన్ ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభమైందని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రెక్కలు ఊడి పోయిన ఫ్యాన్ను విసిరిపారేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎక్స్ వేదికగా ఆయన మండిపడ్డారు. అభివృద్ధి పాలన ఎవరిదో.. విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దామన్నారు. దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. బాదుడు పాలనతో, విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్ ను కూల్చేసిన జగన్.. ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వానికి ఇంకా 50 రోజులే మిగిలుందన్నారు. బూటకపు ప్రసంగాలు కాదని.. అభివృద్ధిపై దమ్ముంటే తనతో చర్చకు రావాలని చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
సీఎం జగన్కు చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్
0
494
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


