24.7 C
Hyderabad
Tuesday, February 11, 2025
spot_img

YS Avinash Reddy | అన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది: అవినాష్ రెడ్డి

YS Avinash Reddy | తనకు తెలిసిదంతా సీబీఐ విచారణలో చెప్పానని వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తెలిపారు. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఎదుట ఆయన హాజరయ్యారు. దాదాపు ఐదు గంటల పాటు అవినాశ్ ను అధికారులు విచారించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన అవినాశ్ రెడ్డి.. ఓ వ్యక్తి టార్గెట్ గా సీబీఐ విచారణ జరుగుతోందని వెల్లడించారు. మీడియాకు మనవి చేస్తున్నా.. తప్పుడు వార్తలు రాయకండి.. వాస్తవాలను రాయండని చెప్పారు. గతంలో విజయమ్మ గారిని కలిస్తే బెదిరించటానికి వెళ్లానని ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసమని పేర్కొన్నారు. ఇలాంటి వార్తలు దర్యాప్తు సంస్థల విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. గూగుల్ టేక్ ఔట్ అంటున్నారు.. గూగుల్ టేక్ ఔటో.. టీడీపీ టేక్ ఔటో కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా తనకు తెలిసిందే చెబుతానని అవినాశ్ రెడ్డి(YS Avinash Reddy) స్పష్టంచేశారు.

Read Also: ఒక్కో ఇల్లు రూ.7కోట్లు.. అయినా కానీ ఎగబడ్డారు

Latest Articles

చిలుకూరు బాలాజీ అర్చకుడిపై దాడి కేసులో కీలక విషయాలు

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ పై దాడికి సంబంధించి కీలక విషయాలను రాజేంద్రనగర్ డిసిపి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురిని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్