Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

హర్యానాలో బీజేపీకి గౌరవప్రదమైన సీట్లు దక్కేనా..?

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతాపార్టీ అత్యంత క్లిష్టపరిస్థితి ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో హర్యానా ఒకటి. బీజేపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి గ్రామీణ ప్రాంతాలకు వెళుతుంటే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. మద్దతు ధరపై చట్టం ఎందుకు చేయలేదని కమలనాథులను నిలదీస్తున్నారు రైతు సంఘాల ప్రతినిధులు. రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రామాలలో కమలం పార్టీని దాదాపు బాయ్‌కాట్ చేశారు అన్నదాతలు. ఫతేహాబాద్‌లో బీజేపీ నేత అశోక్ తన్వర్ ర్యాలీల్లో రైతులు నల్లజెండాలు ప్రదర్శించారు.ఈ నేపథ్యంలో ఈసారి హర్యానాలో బీజేపీకి గౌరవప్రదమైన సీట్లు అయినా దక్కుతాయా అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది.

హర్యానాలో జాట్ సామాజికవర్గం అత్యంత బలమైనది. హర్యానా రాష్ట్ర చరిత్రలో 33 ఏళ్ల పాటు జాట్ నేతలే ముఖ్యమంత్రులుగా కొనసాగారు. పదేళ్ల కిందటి వరకు దేవీలాల్, బన్సీలాల్, భూపేందర్ సింగ్ హుదా లాంటి జాట్ సామాజికవర్గ నేతలే హర్యానా రాజకీయాలను శాసించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో హర్యానా ఒకటి. హర్యానాలో మొత్తం 10 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. హర్యానా మౌలికంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఇక్కడ జాట్ సామాజికవర్గం అంతా వ్యవసాయంపైనే ఆధారపడుతుంది. హర్యానాలో పంటలకు కనీస మద్దతు ధరపై చట్టంతో పాటు రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుతం తీవ్రంగా ఆందోళనలు సాగుతున్నాయి.

కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు ప్రస్తుతం హర్యానా రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నాయి. తమ ఆందోళనల పట్ల నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందనే ఆగ్రహావేశాలు హర్యానాలోని జాట్ రైతుల్లో ఉన్నాయి. హర్యానాలో బలమైన జన్‌నాయక్ జనతా పార్టీతో ఇటీవల భారతీయ జనతా పార్టీ తెగదెంపులు చేసుకుంది. జేజేపీతో విడిపోవడం ప్రస్తుతం కమలం పార్టీకి ఇబ్బందికరంగా మారింది.

హర్యానాలో గత పదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. అయినప్పటికీ రాష్ట్రంలోని ప్రధాన సామాజికవర్గమైన జాట్‌లలో విశ్వసనీయత సాధించడంలో కమలం పార్టీ విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జాట్ సామాజికవర్గంలోని ప్రముఖ నాయకులైన ఓపీ ధన్‌ఖడ్‌, కెప్టెన్ అభిమన్యులను ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అగ్రనాయకత్వం పట్టించుకోలేదు. దీంతో కమలం పార్టీ తీరుపై హర్యానా జాట్ నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే జాట్ వర్గానికి చెందిన మరో ప్రముఖ నేత బీరేంద్ర సింగ్ ఇటీవల బీజేపీకి గుడ్‌బై చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు.

హర్యానాలో బీజేపీ నేతలు ఎక్కడ ప్రచారానికి వెళుతున్నా, స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోనిపట్‌లోని దహియాఖాప్ పరిధిలో ఉన్న 24 గ్రామాల వారు ఇటీవల కమలం పార్టీని దాదాపు బాయ్‌కాట్ చేశారు. సిర్సా ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఫతేహాబాద్‌లో బీజేపీ నేత అశోక్ తన్వర్ ర్యాలీల్లో రైతులు నల్లజెండాలు ప్రదర్శించారు. దీనికి పరాకాష్టగా హిసార్‌లోని నారా ప్రాంతం గురించి చెప్పుకోవాలి. నారా ప్రాంతంలోకి మాజీ ఉప ముఖ్యమంత్రి దుశ్యంత్ చౌతాలా వస్తే….ఆయనను గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు.

1966లో హర్యానా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి హర్యానాలో జాట్ వర్గీయులే చక్రం తిప్పుతున్నారు. హర్యానా జనాభాలో జాట్‌లు 26 శాతం నుంచి 28 శాతం వరకు ఉన్నారు. హర్యానాలోని మొత్తం పది లోక్‌సభ నియోజకవర్గాల్లో నాలుగు సెగ్మెంట్లను జాట్ సామాజిక వర్గం ప్రభావితం చేయగలదు. ఇందులో రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి వచ్చిన అశోక్ తన్వర్, నవీన్ జిందాల్‌కు టికెట్లు ఇచ్చింది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో 42.4 శాతం మంది జాట్ సామాజికవర్గానికి చెందినవారు బీజేపీకి మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. మొత్తం పది లోక్‌సభ నియోజకవర్గాలను కమలం పార్టీయే గెలుచుకుంది. కాగా 39.8 శాతం మంది జాట్‌లు కాంగ్రెస్‌కు ఓటేశారు. మిగిలిన వారు జేజేపీ, ఇండియన్ లోక్‌దళ్‌ కు మద్దతు ఇచ్చారు. జాట్‌ సామాజికవర్గం మద్దతు లేకపోయినా, జాట్‌ యేతరులు, ఓబీసీల అండతో ఇప్పటివరకు బీజేపీ హర్యానాలో నెగ్గుకువస్తోంది. గత రెండు ఎన్నికల్లో మిగిలిన అన్ని వర్గాల ఓట్లను తెచ్చుకోవడం ద్వారా జాట్ సామాజికవర్గం ఓట్లకు ప్రాధాన్యం లేకుండా చేసింది కమలం పార్టీ.

ఇదిలా ఉంటే, 2019 లోక్‌సభ ఎన్నికలు మినహా అన్నిసార్లూ కాంగ్రెస్ పార్టీకే జాట్ సామాజికవర్గం మద్దతు ఇస్తోంది. ప్రస్తుతం భూపేందర్ సింగ్ హుదా, రణదీప్ సింగ్ సూర్జేవాలా, బీరేంద్ర సింగ్ లాంటి జాట్ సామాజికవర్గం నేతలతో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. ఏమైనా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ పెద్ద ఎత్తున ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటోంది. ప్రధానంగా అన్నదాతల నుంచి బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. సంయుక్త్ కిసాన్ మోర్చా, భారతీయ కిసాన్ యూనియన్ సహా పలు రైతు సంఘాలు బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతను బీజేపీ ఎదుర్కోలేకపోతోంది. మద్దతుధరపై చట్టం చేయలేకపోవడం బీజేపీకి పెద్ద మైనస్ పాయింట్ అయింది. అలాగే డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్న వారిని తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని బీజేపీ సర్కార్‌పై మండిపడుతున్నారు హర్యానా రైతులు. ఒక్కమాటలో చెప్పాలంటే కమలం పార్టీకి హర్యానాలో ఎదురుగాలి వీస్తోంది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్