అనంతపురం జిల్లా రాయదుర్గం సెగ్మెంట్లో ఎన్నికల నియామవళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీనివాసులు హెచ్చరించారు. 144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉన్నందున గుంపులుగా ఉండకూడదని అన్నారు. విజయోత్సవ ర్యాలీలను నిషేధించామన్నారు. టపాసులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. కౌంటింగ్ అనంతరం గెలిచిన అభ్యర్థులు క్రాకర్స్ కాల్చడం, ర్యాలీలు చేయడం నిషేధం అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో వెయ్యి 585 బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని డీఎస్పీ కోరారు.


