అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఓ తెలంగాణ విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఈ నెల 2 నుంచి 25 ఏళ్ల రూపేశ్ చంద్ర చింతకింది ఆచూకీ తెలియడం లేదని షికాగోలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. రూపేశ్ జాడ కనిపెట్టేందుకు స్థానిక పోలీసులతోపాటు ప్రవాస భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది .. మరోవైపు ఈ విషయంలో తమకు సహకరించాలని పోలీసు లు సైతం స్థానికులను కోరారు.