31.2 C
Hyderabad
Saturday, May 10, 2025
spot_img

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద వైఎస్ షర్మిల అరెస్ట్

YSRTP అధ్యక్షురాలు షర్మిల(Sharmila) ఢిల్లీలో అరెస్ట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఛలో పార్లమెంట్‌కు ఆమె పిలుపునిచ్చారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న కారణంగా ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా కానీ ఆమె ర్యాలీకి సిద్ధమవ్వడంతో జంతర్ మంతర్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పార్లమెంట్ పోలీస్ స్టేషన్‌కు షర్మిలను తరలించారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కాగా కేసీఆర్ ప్రభుత్వంలోని అవినీతిపై చర్యలు తీసుకోవాలని కొంతకాలంనగా షర్మిల డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర పెద్దలను కూడా కలిసి దీనిపై ఫిర్యాదుచేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతిపై విచారణ చేపట్టాలని ఢిల్లీ వెళ్లి సీబీఐకి కూడా పలుమార్లు ఫిర్యాదులు చేశారు.

Read Also: హృదయవిదారకం.. ప్లాస్టిక్ డ్రమ్ లో మహిళ శవం

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్