ఉచిత విద్యుత్ను అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేత NVSS ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు తీవ్రంగా ఉన్నాయని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని మండిపడ్డారు. రైతు రుణమాఫీ వెంటనే చేయాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చితే.. ప్రస్తుతం సీఎం రేవంత్ కూడా అదే దారిలో నడుస్తున్నారని విమర్శించారు.


