చివరి 5 మ్యాచుల్లో ఫలితాలు..
భారత్: చివరి 5 వన్డేల్లో 4 గెలిచింది. ఒక్క మ్యాచ్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
పాకిస్థాన్: 5లో 3 గెలిచింది. 2 ఓడిపోయింది.
భారత్లో పాకిస్థాన్పై టీమ్ ఇండియా రికార్డు..
ఇరు జట్ల మధ్య 134 వన్డేలు జరగ్గా అందులో భారత్ 56, పాకిస్థాన్ 73 విజయాలు సాధించాయి. ఐదు మ్యాచ్లు అసంపూర్తిగా నిలిచాయి. భారత్లో ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 30 వన్డేలు జరగ్గా, 19 వన్డేల్లో పాకిస్థాన్ గెలుపొందగా, 11 వన్డేల్లో మాత్రమే భారత్ గెలుపొందింది.
పిచ్ రిపోర్ట్..
నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. ఫాస్ట్ బౌలర్లు కూడా ఇక్కడ సహాయం పొందుతారు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక్కడ మంచు కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది. మంచు కురిస్తే రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే జట్టుకే ప్రయోజనం.
ఈ స్టేడియంలో ఇప్పటి వరకు మొత్తం 27 వన్డేలు జరిగాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 14 మ్యాచ్లు గెలుపొందగా, ఛేజింగ్ చేసిన జట్టు 13 మ్యాచ్ల్లో విజయం సాధించింది.
ఇరుజట్ల ప్లేయింగ్ 11:
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.