స్వతంత్ర, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో విషాదం నెలకొంది. 40 మందితో కూడిన ట్రాక్టర్ పంటకాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్పాట్ లోనే ముగ్గురు మృతి చెందారు. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఆస్పత్రిలో తరలించే క్రమంలోనే మార్గంమధ్యలో మరో ముగ్గురు మృతి చెందారు. చేబ్రోలు మండలం జూపూడికి 40 మందితో కూడిన ట్రాక్టర్ శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులను ప్రత్తిపాడు మండలం కొండెపాడు వాసులుగా గుర్తించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.