25.3 C
Hyderabad
Tuesday, July 1, 2025
spot_img

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్ విమర్శలు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. అసమర్థమైన ముఖ్యమంత్రి తీరుతో గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మంత్రులు తీసుకునే జీతంలో సగం ఖర్చుపెట్టైనా గురుకులాల్లో విద్యార్థుల చావులను ఆపాలన్నారు. తాను తొమ్మిదేళ్లు గురుకుల కార్యదర్శిగా పని చేసినప్పుడు పిల్లలను కంటికి రెప్పలా కాపాడనన్నారు. 420 రోజుల కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే 56 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారని దుయ్యబట్టారు. ఇకనైనా రేవంత్‌రెడ్డి తన సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్‌ గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఆరాధ్య స్వగ్రామానికి చేరుకున్నారు. మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆర్థిక సహాయం అందజేసి వారికి ధైర్యం చెప్పారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ ఛైర్మన్ ఉప్పల వెంకటేష్ ఉన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్