హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. శంషాబాద్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్య తలెత్తింది. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన విమానం టేక్ ఆఫ్ కాకపోవడంతో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. విమానంలో సినీ సెలబ్రిటీలు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారు. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ విమానంలో ఉన్నారు.. 30 వేలు పెట్టి టికెట్ కొని ఇప్పటివరకు విమానం టేక్ అప్ కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.