సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పదోతరగతి విద్యార్థి మృతిచెందాడు. స్నేహితునితో కలిసి పోతుగల్ గ్రామం నుచి బదనపల్లికి వెళ్తుండగా సారంపల్లి వద్ద రహదారి దాటుతుండగా ప్రమాదం జరిగింది. వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇషాంత్ అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.