బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ నుంచి తాను డబ్బులు తీసుకున్నట్లు ఈటల నిరూపించాలని డిమాండ్ చేశారు. డబ్బులు తీసుకోలేదని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేయడానికి తాను వస్తానని.. ఈటల కూడా వచ్చి ప్రమాణం చేయాలని ఛాలెంజ్ చేశారు. రాష్ట్రంలోని ఏ ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయమన్నా చేస్తానని.. ఈటల దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని రేవంత్ మండిపడ్డారు.
ఆరు నెలలు ఆగితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. అలాంటప్పుడు తాను ఎందుకు కేసీఆర్ దగ్గర రూ.25కోట్లు తీసుకుంటానని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేసింది తాను ఒక్కడినేనని రేవంత్ పేర్కొన్నారు. అలాగే మునుగోడు ఉపఎన్నికలో తనకు తమ పార్టీలోని అగ్రవర్గాల వారెవరూ సహాయం చేయలేదని.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారే అండగా నిలబడ్డారని రేవంత్ వ్యాఖ్యానించారు.