24.6 C
Hyderabad
Saturday, February 28, 2026
spot_img

అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు రూ.3వేల భృతి

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచారంలో బిజీ బిజీ అయ్యారు. ఇప్పటికే ప్రధాని మోదీ మాండ్యలో పర్యటించగా.. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బెళగావిలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన యువక్రాంతి సమావేవంలో రాహుల్ పాల్గొని పలు హామీలు ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులైన పట్టభద్రులకు రెండేళ్ల పాటు నెలకు రూ.3వేలు, డిప్లొమా వారికి రూ.1500 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఏడాన్నరలో రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. మొత్తమ్మీద 10లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు చేశారు. కర్ణాటకలో ఏదైనా పని జరగాలంటే 40శాతం కమీషను ఇవ్వాల్సిందేనంటూ రాహుల్ ఆరోపించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్