కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో బిజీ అయిపోయారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ మైసూరులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న మైలారి అగ్రహార రెస్టారెంట్కు వెళ్లారు. అనంతరం కిచెన్ లోకి వెళ్లి స్వయంగా పిండిని కలిపి దోశెలు వేశారు. అనంతరం రెస్టారెంట్ లో ఉన్న చిన్నారులతో సరదాగా గడిపారు.
ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేసుకున్న ప్రియాంక గాంధీ.. లెజెండరీ మైలారి రెస్టారెంట్ యజమానులతో కలిసి దోసెలు వేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రియాంక వెంట కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఆ రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ రణ్ దీప్ నూర్జేవాలా ఉన్నారు. కాగా మే 10న జరగనున్న ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమాలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది.
Enjoyed making dosas with the legendary Myalri Hotel owners this morning….what a shining example of honest, hard work and enterprise.
Thank you for your gracious hospitality.
The dosas were delicious too…can’t wait to bring my daughter to Mysuru to try them. pic.twitter.com/S260BMEHY7— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 26, 2023