తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో తనను అక్రమ కేసులో ఇరికించే యత్నం చేశారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా ఆరోపించారు. వైసీపీకి కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని హితవు పలికారు. విజయవాడ సీపీపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలని అన్నారు. వైసీపీ పరిధిలో కాకుండా తాము ఈసీ పరిధిలో ఉన్నామని పోలీసులు గుర్తించాలని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు పని చేయాలని తెలిపారు. సజ్జల చెప్పారని తమపై తప్పుడు కేసులు పెడతామంటే కుదరదని హెచ్చరించారు. విజయవాడ సెంట్రల్లో ఏసీపీ, సీఐలు వెలంపల్లి కనుసన్నల్లో నడుస్తున్నారని ఆరోపించారు.