తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఫస్టియర్లో 60.01శాతం, సెకండి యర్లో 64.19 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్టియర్లో 2.87లక్షల మంది, సెకండియర్లో 3.22లక్షల మంది విద్యార్థులు పాసయ్యారు.ఇంటర్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఫస్టియర్లో 68.35 శాతం బాలికలు, 51.5 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్లో 72.53 శాతం బాలికలు, 56.1 శాతం బాలురు పాసయ్యారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో.. మేడ్చల్ ద్వితీయ స్థానంలో నిలిచాయి. సెకండియర్లో ములుగు మొదటి స్థానంలో.. మేడ్చల్ ద్వితీయ స్థానంలో నిలిచాయి.