24.7 C
Hyderabad
Tuesday, February 11, 2025
spot_img

ఫైన్‌ కట్టండి.. పేర్ని నాని సతీమణికి మరోసారి నోటీసులు

లెక్క తేల్చిన బియ్యానికి ఫైన్ కట్టమని చెబుతూ మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మరోసారి నోటీసులు ఇచ్చారు. గోడౌన్‌లో బియ్యం మాయంపై ఇటీవల పౌరసరఫరాల శాఖ అధికారులు విచారణ చేపట్టారు. తొలుత 185 మెట్రిక్ టన్నులకు డబుల్ పెనాల్టీగా జయసుధ రూ.1.79 కోట్లు జరిమానా కట్టారు. ఇక పూర్తి స్థాయి విచారణ అనంతరం 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్టు గుర్తించారు. పెరిగిన షార్టేజీకి కూడా ఫైన్ చెల్లించాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీనికి అదనంగా రూ.1.67కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన సివిల్ సప్లయిస్ బఫర్ గోడౌన్ లో మాయమైన రేషన్ బియ్యం లెక్క తేల్చిన అధికారులు అందుకు సంబంధించి డబుల్ పెనాల్టీ చెల్లించాలని గోడౌన్ యజమానురాలు జయసుధకు నోటీసులు ఇచ్చారు. తొలుత 185 టన్నుల బియ్యం మాయమైనట్టు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు.. అందుకు సంబంధించి డబుల్ పెనాల్టీ కింద రూ.1.70 కోట్లు ఫైన్ వేశారు. ఈ మొత్తాన్ని లాయర్ల ద్వారా రెండు డీడీలుగా చెల్లించారు. ఆ తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన అధికారులు మొత్తం 378 మెట్రిక్ టన్నులు షార్టేజీ వచ్చినట్టు నిర్ధారించారు. షార్టేజీ వచ్చిన మొత్తం బియ్యానికి డబుల్ పెనాల్టీగా రూ.3.37కోట్లు ఫైన్ విధించారు. గతంలో చెల్లించిన రూ. కోటి 70 లక్షలు మినహాయించి మిగిలిన రూ.1.67 కోట్లు చెల్లించాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ.. గోడౌన్ యజమానురాలు పేర్ని జయసుధకు నోటీసులు జారీ చేశారు.

Latest Articles

విజయ్ దేవరకొండ- దిల్ రాజు సినిమాకు ఆడిషన్స్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో మరో క్రేజీ మూవీలో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్