ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్లో ఆయన తన ఆస్తుల వివరాలను తెలిపారు. మొత్తం 3.02 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు చెప్పారు. తన వద్ద ప్రస్తుతం 52,920 నగదు ఉన్నట్లు తెలిపారు.మోదీ తన ఆస్తుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు 2.85 కోట్లు ఉన్నాయని తెలిపారు. 2.67 లక్షల విలువైన బంగారం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లలో 9.12 లక్షల రూపాయల పెట్టుబడి ఉన్నట్లు చెప్పారు. 2014లో మోదీ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ అప్పట్లో 1.66 కోట్లుగా ఉంది. 2019లో మోదీ ఆస్తుల విలువ రూ.2.51 కోట్లుగా ఉన్నట్లు అఫిడవిట్ లో తెలిపారు.