రాజస్థాన్ లోని హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ కు చెందిన గనుల్లో 15 మంది అధికారులు చిక్కుకు పోయారు..దాదాపు 12 గంటలపాటు నిర్విరామంగా ప్రయత్నించి ముగ్గురిని రక్షించారు. మిగతావారిని రక్షించేందుకు కృషిచేస్తున్నారు. వారి బంధువులు, తోటి కార్మికులు గని వద్ద ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఆ ప్రాంతంలో మోహరించారు. రాజస్థాన్ లోని నీమ్ కా థానా జిల్లాలోని కోలిహాన్ గనిలో మంగళవారం రాత్రి లిఫ్ట్ కూలిపోవడంతో హెచ్ సీఎల్ కు చెందిన 15 మంది అధికారులు చిక్కుకు పోయారు. ముగ్గురిని రక్షించారు. వారిని ఎకె శర్మ, హన్స్ రామ్, ప్రీతం సింగ్ గా గుర్తించారు. మిగిలిన 12 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గని పరిస్థితిని సమీక్షించేందుకు కోల్ కతా నుంచి విజిలెన్స్ బృందం గనిలోకి వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 700 మీటర్ల లోతులో ఈ 15 మంది చిక్కుకు పోయారు. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి.
కాపర్ గనుల్లో చిక్కుకుపోయిన 15 మంది అధికారులు
0
232
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


