దేశ భద్రత కోసం మోదీని గెలిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వరంగల్ అభివృద్ధి కోసం కుల, మతాలకు అతీతంగా బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ని గెలిపించాలని హనుమకొండ ప్రెస్క్లబ్లో కృష్ణమాదిగ అన్నారు. వరంగల్ రూపురేఖలు మార్చేందుకు రమేష్తో కలిసి తాను కృషి చేస్తానని చెప్పారు. కేసీఆర్ పదవి నుంచి దిగిపోయే వరకు తనకు అపా యింట్ ఇవ్వలేదని కృష్ణమాదిగ విమర్శించారు. కడియ కావ్య లాంటి నకిలీ ఎస్సీలను గెలిపించవద్దని ఓటర్లకు కృష్ణమాదిగ విజ్ఞప్తి చేశారు.


