25.3 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

ఇది ఆ ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మాత్రమే: కేటీఆర్

Minister KTR |టీఎస్​పీఎస్​సీ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై మంత్రి కేటీఆర్​ స్పందించారు. ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కమిషన్‌లోనే పనిచేసే ఇద్దరు చేసిన తప్పు.. వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చిందని అన్నారు. గత ఎనిమిదేళ్లుగా చిత్తశుద్ధితో టీఎస్‌పీఎస్‌సీ పనిచేస్తోందని అన్నారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చట్టసవరణ చేశామన్నారు. నిరుద్యోగ యువత ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని.. ఇది ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మాత్రమేనని అన్నారు.

రాజకీయ నిరుద్యోగులు చేసే వ్యాఖ్యానాలను పట్టించుకోవద్దని అన్నారు కేటీఆర్(Minister KTR ). కమిషన్‌లోనే పనిచేసే ఇద్దరు చేసిన తప్పు.. వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చిందని అన్నారు, ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి ఇద్దరే కాదు.. ఇంకా ఎవరున్నా కఠిన చర్యలు తప్పవన్నారు. లక్షలమంది పిల్లలకు ఇబ్బంది కలగకూడదని.. ఈ ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. దేశంలో ఎవరూ చేయనంత వేగంగా 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇలాంటి వ్యక్తుల పొరపాటు వల్ల వచ్చిన తప్పిదాలు మరోసారి రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఫీజు చెల్లించినందువల్ల అభ్యర్థులెవరూ మళ్లీ కట్టాల్సిన పనిలేదని వెల్లడించారు.

Read Also: శాసనసభలో గందరగోళం.. అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్