31 C
Hyderabad
Monday, June 9, 2025
spot_img

భారత్‌కు క్షమాపణలు చెప్పిన మెటా

భారత్‌లో లోక్‌సభ ఎన్నికలపై మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ టెక్‌ దిగ్గజం స్పందించింది. భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. ఇది అనుకోకుండా జరిగిన పోరపాటు అని క్షమించాలని కోరింది. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఆయనపై చర్యలకు సిద్ధమైన వేళ ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే..

జనవరి 10న జరిగిన పోడ్‌కాస్ట్‌లో, 40 ఏళ్ల ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు జుకర్‌ బర్గ్‌ మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై నమ్మకాన్ని కోల్పోయేలా చేసిందని అన్నారు. ఈ విషయంలో భారతదేశాన్ని ఉదాహరణగా తీసుకుని తప్పుగా చెప్పారు. గతేడాది భారత్ సహా ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓటమి చెందాయని జుకర్‌ బర్గ్‌ వ్యాఖ్యానించారు. అయితే జుకర్‌ బర్గ్‌ చేసిన వ్యాఖ్యలను భారత్‌ ఖండించింది.

ప్రజాస్వామ్య దేశం విషయంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం.. ఆ దేశ ప్రతిష్టకు భంగం కలిగించడమే అవుతుంది. తప్పుగా మాట్లాడిన జుకర్‌ బర్గ్‌ దేశానికి, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే అని బీజేపీ ఎంపీ, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై హౌస్ ప్యానెల్ చైర్మన్ నిషికాంత్ దూబే అన్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే కారణంతో మెటాకు సమన్లు ఇస్తున్నట్లు తెలిపారు.

అటు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కూడా కౌంటరిచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో.. లోక్‌ సభ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి ఓట్లు వేసి ప్రజలు మూడోసారి గెలిపించారని అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్