25.7 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

కాంగ్రెస్‌పై మందకృష్ణ తీవ్ర ఆరోపణలు

కాంగ్రెస్‌పై మందకృష్ణ మాదిగ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటే ఎస్సీ వర్గీకరణ అయ్యేది కాదన్నారు. 2004లో కాంగ్రెస్‌ సహకరించక పోవడం వల్లే ఎస్సీ వర్గీకరణ రద్దైందని విమర్శించారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ వర్గీకరణ మీద ఒక్కసారి మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. బీజేపీ వల్లే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పారు. సుప్రీం కోర్టులో ఓడిన మాదిగలు..అదే కోర్టులో నేడు గెలిచారన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ ఎంపికైన తర్వాత మాదిగలకు అన్యాయం జరిగిందని మందకృష్ణ మండిపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలకు అన్యాయం చేయాలని చూస్తే రేవంత్‌కు ఎదురునిలబడతామని హెచ్చరించారు.

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్