19.2 C
Hyderabad
Friday, January 17, 2025
spot_img

పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి.. చంద్రబాబు సీరియస్

తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యరు. టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలని మండిపడ్డారు. ఏర్పాట్లు సరిగా చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పాట్ల విషయంలో ఎందుకింత వైఫల్యం జరిగిందని నిలదీశారు. బాధ్యత తీసుకున్నవారు సరిగా నెరవేర్చాలి కదా అని మండిపడ్డారు. 2వేల మందే పడతారని అనుకున్నప్పుడు.. 2500 మందిని ఎందుకు లోపలికి పంపించారని ప్రశ్నించారు. ఎక్కువమంది ఉన్నప్పుడు గేటు తీసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా..? అని అన్నారు. పద్ధతి ప్రకారం పనిచేయాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

భక్తులు కూర్చున్నప్పుడు పరిస్థితి బాగానే ఉందని అధికారులు సీఎంకు వివరించారు. బయటకు వదిలినప్పుడు ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పిందని వివరించారు.

అంతకుముందు చంద్రబాబు విజయవాడ నుంచి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి తిరుపతి వచ్చారు. నగరంలోని బైరాగిపట్టెడ వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

Latest Articles

హోరా హోరీగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరా హోరీగా కొనసాగుతోంది. నేటితో ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుంది. నేటి సాయంత్రం 3 గంటలతో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈసీ సమయం ఇచ్చింది. నామినేషన్లను ఈసీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్