చిత్తూరు జిల్లా కాణిపాకం(Kanipakam) ఆలయం నిత్యాన్నదాన సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఆలయ అన్నదానానికి సంభందించి నిత్యావసర వస్తువులు దొంగతనానికి గురైయ్యాయని ఆలయ అధికారులు గుర్తించారు. ఈ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు ప్రధాన వంట మనుషులు, వారి సహాయకుల ఇళ్లల్లో ఆలయ నిత్యాన్నదాన వస్తువులు పట్టుబడ్డాయి. వారి వద్ద నుండి సుమారు 25 బస్తాల బియ్యం, రెండు బస్తాల కందిపప్పును ఆలయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితులలోనైనా విడిచిపెట్టేది లేదంటున్నారు ఆలయ అధికారులు. వీరి ఇళ్లతో పాటుగా ఆలయ సిబ్బంది ఇళ్లల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు.
Read Also: తిరుమలలో కలకలం రేపుతున్న నకిలీ సుప్రభాత సేవా టిక్కెట్ల విక్రయం
Follow us on: Youtube, Instagram, Google News