వెనుకబడిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 114 చెరువులకు సాగునీరు అందిస్తామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. వైసీపీ అరాచక పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు వచ్చే ఎన్నికలలో టీడీపీని గెలిపించేందుకు ఉత్సాహంగా ఉన్నారన్నారు. కుందుర్పిలో అమిలినేని రోడ్షో నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. ప్రజలు తనను ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించాలని అమిలినేని అభ్యర్థించారు.


