తెలంగాణ మంత్రి కేటీఆర్కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. దుబాయ్లో జరగనున్న ప్రపంచ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ట్రెస్కాన్ సంస్థ నిర్వాహకులు ఆహ్వానం పలికారు. జూన్ 7, 8 తేదీల్లో దుబాయ్లోని జుమేరా ఎమిరేట్స్ టవర్స్లో వరల్ట్ ఏఐ షో-మెనా 41వ గ్లోబల్ ఎడిషన్ జరగనుంది. కేటీఆర్ నాయకత్వంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందని… అటువంటి నాయకులు పాల్గొనడం వల్ల సమావేశానికి ఎంతో విలువ చేకూరుతుందని నిర్వాహకులు తెలిపారు.