రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో అక్రమ మైనింగ్పై హైడ్రా అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. కొత్వాల్ గూడ, వట్టి నాగులపల్లి, గౌలిదొడ్డి ప్రాంతాల్లో అనుమతులు లేకుండా మైనింగ్, స్టోన్ క్రషింగ్, RMC యూనిట్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీంతో హైడ్రా 6 క్రషింగ్ యూనిట్లు, 12 RMC ప్లాంట్లను తొలగించింది. మొత్తం 6 చోట్ల కూల్చివేతలు నిర్వహించింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనుమతులు లేకుండా క్వారీలు తవ్వకం జరుగుతున్నట్టు నిర్ధారించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.


