21.7 C
Hyderabad
Thursday, March 20, 2025
spot_img

104 మంది భారతీయుల తరలింపునకు ఎంత ఖర్చు అయ్యిందంటే..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అన్నంత పని చేస్తున్నాడు. వలసదారులను తమ దేశాలకు పంపిస్తామని చెప్పిన ఆయన.. దాన్ని అమలు చేస్తున్నాడు. అక్రమంగా తమ దేశంలో ఉంటున్న వలసదారులను సైనిక విమానాల ద్వారా సొంత దేశాలకు పంపిస్తున్నాడు.

ఏఎఫ్‌పీ విశ్లేషణ ప్రకారం.. వలసదారులను తరలించడానికి ఖరీదైన విమానాలను ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. తాజాగా ఇండియన్స్‌ను తరలించడానికి అక్షరాల అయిన ఖర్చు 1 మిలియన్ డాలర్లు (రూ .8.74 కోట్లు).

వాస్తవానికి సైనిక విమానాలు, పౌర విమానాల కంటే మూడు రెట్లు ఎక్కువ ఖర్చు అవుతాయని తెలుస్తోంది.

తాను అధికారంలోకి వస్తే “అమెరికా చరిత్రలో” అతిపెద్ద బహిష్కరణను నిర్వహిస్తామని వాగ్దానం చేసిన ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బహిష్కరణ లక్ష్యంగా ఉన్న చాలా మంది వలసదారులు లాటిన్ అమెరికా నుండి వచ్చినప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వలసదారులను తిరిగి పంపిస్తున్నారు.

బుధవారం, యుఎస్ వైమానిక దళం కార్గో విమానం అమృత్‌సర్‌లో అడుగుపెట్టింది. అమెరికా ప్రభుత్వం ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్‌లో చట్టవిరుద్ధంగా ప్రవేశించిన 104 మంది భారతీయులను తరలించింది.

భారతీయ వలసదారులను తరలించేందుకు మొదటిసారి సైనిక విమానాన్ని ఉపయోగించినట్టు సమాచారం.

ఏఎఫ్‌పీ చిత్రాల ప్రకారం.. ఈ విమానం సి -17 ఏ గ్లోబ్‌మాస్టర్ III.. దళాలు, వాహనాలు, సామగ్రిని రవాణా చేసే శక్తి సామర్థ్యమున్న అతి పెద్ద సైనిక విమానం.

1995లో మొదటిసారి ఈ విమానాన్ని అమెరికా వైమానిక దళంలో చేర్చినప్పటి నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు.

కానీ చార్టర్ విమానాల కంటే సైనిక విమానాలు ఉపయోగించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. వీటిని అక్రమ వలసదారులను తరలించడానికి ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) కూడా ఉపయోగిస్తున్నాయి.

2021 లో ICE విడుదల చేసిన సమాచారం ప్రకారం, చార్టర్ ఫ్లైట్ ఖర్చు గంటకు, 8,577 డాలర్లు. అయినప్పటికీ అధిక-రిస్క్ వలసదారులను రవాణా చేసే విమానాలు ఎక్కువ ఖర్చు అవుతాయి.

యుఎస్ ఎయిర్ మొబిలిటీ కమాండ్ ప్రచురించిన పత్రాల ప్రకారం.. సి -17 విమానాలను ఉపయోగిస్తే గంటకు 28,562 డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

వేరే దేశాల్లో ప్రయాణించేటప్పుడు గగనతలంలో వచ్చే సమస్యల కారణంగా సైనిక విమానాలు.. వాణిజ్య విమానాల మాదిరిగా కాకుండా వేరే మార్గాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది.

ఈ సైనిక విమానాలు సాధారణంగా వాణిజ్య కేంద్రాలకు బదులుగా సైనిక వాయు స్థావరాల వద్ద ఇంధనం నింపుకుంటాయి.

ఫ్లైట్ ట్రాకింగ్ సైట్ ఫ్లైట్రాడార్ 24 నుండి వచ్చిన డేటా ప్రకారం.. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలోని మెరైన్ కార్ప్స్ ఎయిర్ స్టేషన్ మిరామార్ నుండి సైనిక విమానంలో సోమవారం 1330 GMT వద్ద బయలుదేరింది.

తర్వాత విమానం పశ్చిమాన హవాయికి వెళ్లింది. పసిఫిక్‌ను దాటి ఫిలిప్పీన్స్ సమీపంలోని లుజోన్ జలసంధికి చేరింది. ఇండోనేషియా , మలేషియా మధ్య ప్రయాణించింది., తరువాత హిందూ మహాసముద్రంలోకి విమానం వెళ్లింది. అక్కడ చిన్న ద్వీపమైన డియెగో గార్సియాలో యుఎస్ వైమానిక స్థావరం ఉంది.

అక్కడి నుండి ఇది ఉత్తరాన భారతదేశానికి వేలాది మైళ్ళు (కిలోమీటర్లు) ప్రయాణించి, కాలిఫోర్నియా నుండి టేకాఫ్ చేసిన 43 గంటల తర్వాత .. స్థానిక సమయం బుధవారం మధ్యాహ్నం అమృత్‌సర్‌ వద్ద దిగింది.

Latest Articles

గోల్ఫింగ్ ప్రతిభ ప్రదర్శనకు గోల్డెన్ ఆపర్ట్యూనిటీ గోల్ఫ్ టోర్నీ – టీ9 ఛాలెంజ్ గోల్ఫ్ టోర్నీ ఘనంగా ప్రారంభం

దేహదారుడ్యానికి, మానసిక వికాసానికి దోహదమయ్యేవి క్రీడలు. శారీరక ఆరోగ్యానికి చక్కని సాధనమైన క్రీడలు, మనిషికి నూతన శక్తి కల్గించి, కొత్త పుంతలు తొక్కిస్తాయి. మనోరంజక సాధకంగా నిలిచి వీక్షకులను ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్