తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ జయప్రద దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆమె శ్రీనివాసుని సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయం అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల జయప్రద మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బాగుండాలని, ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని స్వామివారిని కోరుకున్నానని అన్నారు. బీపీపీ తరఫున తనను ప్రచారానికి పిలిస్తే తప్పకుండా చేస్తానని జయప్రద తెలిపారు.


