గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఉమ్మడి ఆపరేషన్లో 602కోట్లు విలువ చేసే 86కిలోల డ్రగ్స్ను పట్టుకున్నారు. 14మంది పాకిస్తాన్ పౌరులను అరెస్టు చేశారు. ఆపరేషన్ సమయంలో అరెస్టు నుండి తప్పించుకునే ప్రయత్నంలో పాకిస్తాన్ పౌరులు ATS అధికారులపైకి తమ పడవను నడిపేందుకు ప్రయత్నించారు. దీంతో అధికారులు ప్రతీకారంగా కాల్పులు జరిపారు. అనంతరం నిందితులను అరెస్టు చేశారు. భద్రతా సంస్థలు రెండు రోజులుగా అంతర్జాతీయ సముద్ర సరిహద్దుల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.