24.5 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

కాంగ్రెస్ పార్టీకి, పేద, బడుగు, బలహీన వర్గాల పెన్నిధి పీజేఆర్‌ – శ్రీధర్‌బాబు

కాంగ్రెస్ పార్టీకి విశిష్ట సేవలు అందించి, పేద, బడుగు, బలహీన వర్గాల పెన్నిధిగా దివంగత పి. జనార్దన్‌రెడ్డి నిలిచారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కార్మికులకు నిత్యం అందుబాటులో ఉండి, తన తుది శ్వాస వరకు విలువలతో కూడాన రాజకీయాలకు పీజేఆర్‌ అంకితమైన గొప్ప నాయకుడని కొనియాడారు. దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత పి. జనార్దన్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ఆయన కుమార్తె విజయరెడ్డి నివాళి అర్పించారు. పీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, వేముల నరేందర్‌రెడ్డి, ఖైరతాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్