రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్ పల్లి పరిధిలో ఇటీవల తరుచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నా యి. తాజాగా మైలార్దేవ్ పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని టాటా నగర్లో అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది. కాటన్ బెడ్ తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో కూడిన మంటలు ఎగిసిపడు తున్నాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు.


