32.7 C
Hyderabad
Friday, July 11, 2025
spot_img

అనంతపురంలో ఫైర్‌ యాక్సిడెంట్‌.. జేసీ ట్రావెల్స్‌ బస్సులు దగ్ధం

అనంతపురం నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులు దగ్ధమయ్యాయి. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్దమయ్యాయి. బస్సులపై కేవీ 11 వైర్ తెగి నిప్పురవ్వలు పడడంతో మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు చుట్టుపక్కల వ్యాపించాయి. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో 4 బస్సులు దగ్దమయ్యాయి.

ఈ ప్రమాదం గురువారం తెల్లవారుజామున జరిగింది. బస్సుల వద్ద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై జేసి కుటుంబం ఇంత వరకు స్పందించలేదు. బస్సులు పూర్తిగా స్క్రాప్ అయిన నేపథ్యంలో జేసి కుటుంబం దీనిపై స్పందించలేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించిన కారణాలు పోలీసుల విచారణ లో తెలియాల్సి ఉంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్