కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలోని DCCB బ్యాంక్ ముందు రైతులు ధర్నాకు దిగారు. రుణాలు తీసుకున్న రైతులపై బ్యాంకు అధికారులు వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సంఘీభావం తెలిపారు. రైతులను వేధిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని సురేందర్ హెచ్చరించారు. రైతుల భూములలో ఎర్రజెండాలు, ఫ్లెక్సీలు పాతడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ ఎదురు కాలేద న్నారు. రైతుల జీవితాలతో చెలగాటమాడం మంచిది కాదన్నారు మాజీ ఎమ్మెల్యే సురేందర్.


