అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి, అన్నదాతలు నిలువునా నష్టపోతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి, నారాయణపురం, వలిగొండ, బీబీనగర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వేల బస్తాల ధాన్యం తడిసి ముద్దయింది. కొన్ని చోట్ల నీట మునిగి ధాన్యం రాసులు కొట్టుకు పోయాయి. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ అలసత్వం, కాంటా వేసిన ధాన్యాన్ని తరలించకపోవడం, గన్ని బ్యాగుల కొరతతో నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


