దీపావళి పండుగకు ముందు దేశ రాజధానిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీని పొగ, కాలుష్యం కమ్మేస్తోంది. దీపావళికి ముందే ఢిల్లీ ఎన్సీఆర్లో గాలి నాణ్యత క్షీణించింది. దీంతో కళ్లు మంటలు, గొంతు నొప్పి, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్పై 293 పాయింట్లుగా గాలి నాణ్యత ఉంది. గత మూడు రోజుల నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ లో కాలుష్య నివారణకు మొదటి దశ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అమలవుతోంది. ఢిల్లీ NCRలో కాలుష్య నియంత్రణకోసం శీతాకాల, నిర్దిష్ట వాయు కాలుష్య చర్యలను అమలు చేయాలని ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు కేంద్రం వాయు కాలుష్య నియంత్రణ ప్యానెల్ ఆదేశాలు జారీ చేసింది.