25.7 C
Hyderabad
Wednesday, June 18, 2025
spot_img

బిగ్ బ్రేకింగ్: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. ఏడు బోగీలు బోల్తా

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి హౌరా వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి ప్రయాణికులతో ఉన్న ఏడు బోగీలు పల్టీకొట్టాయి. దీంతో ప్రయాణికులు చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ఘటనలో దాదాపు 50మందికి పైగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో ప్రయాణికుల ఆర్తనాదాలు మిన్నంటాయి. బాలాసోర్‌కు 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న బహనాగ్ రైల్వేస్టేషన్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్