30.5 C
Hyderabad
Monday, June 30, 2025
spot_img

ఈటల ఖబడ్దార్ అంటూ కాంగ్రెస్ నేతల హెచ్చరిక

మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ రూ. 25 కోట్లు తీసుకుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు ఈటల రాజేందర్ పార్టీలు మార్చారని మండిపడ్డారు. ఇతర పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు అందరి ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ఈటల రాజకీయంగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ గురించి జాగ్రత్తగా మాట్లాడాలని.. ఖబడ్దార్ ఈటల అంటూ షబ్బీర్ హెచ్చరించారు.

మరోవైపు మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన పాల్వాయి స్రవంతి కూడా ఈటల వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఈటల రాజేందర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు బై ఎలక్షన్స్ లో నేతలను విచ్చలవిడిగా కొనుగోలు చేశారని ఆరోపించారు. తక్షణమే ఈటల క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్