25.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

నేడు డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వనున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో నేడు DSC అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. LB స్టేడియం వేదికగా సాయంత్రం జరగనున్న కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులు అపాయింట్ మెంట్ లెటర్స్ అందుకోనున్నారు . 6 నెలల్లో డీఎస్సీ పోస్టుల భర్తీ పూర్తి చేసిన ప్రభుత్వం.. ఇవాళ నియామక పత్రాలు అందజేయనుంది. మొత్తం 11 వేల 62 ఉద్యోగాలకు 10 వేల 6 మంది అభ్యర్థులు అపాయింట్‌ మెంట్‌ లెటర్స్‌ తీసుకోబోతున్నారు.

స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రాలు అందుకోబోతున్నారు. కోర్టు కేసుల కారణంగా వెయ్యి 56 మంది అభ్యర్ధుల వెరిఫికేషన్ నిలిచిపోయింది. కోర్టు కేసులు పరిష్కారమయ్యాక మిగిలిన అభ్యర్థులకు కూడా అపాయింట్‌ మెంట్‌ లెటర్స్‌ అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది.

రాష్ట్రంలో 11 వేల 62 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 29న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్టు 5 తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా DSC రాతపరీక్షలను నిర్వహించింది. గతనెల 30న DSC ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. దసరా పండుగ లోపు ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్ మెంట్‌ లెటర్స్‌ అందిస్తామని ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి చెప్పారు. చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి ఇవాళ నియామకపత్రాలు అందజేయనున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్