CM KCR | ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సుందర దృశ్యం, శ్వేతసౌధం డా. బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ప్రారంభం అయింది. తెలంగాణకు మకుటాయమానంగా నిలుస్తున్న కొత్త సచివాలయాన్ని మంత్రులు, అధికార నాయకులు, అధికారులతో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం శిలాఫలకం ఆవిష్కరించారు. ఆ తర్వాత తూర్పు గేట్ నుంచి సచివాలయం లోపలికి వెళ్లారు. యాగంలో పాల్గొనేందుకు గేట్ దిగి యాగశాలకు కాలినడకన వెళ్లారు ముఖ్యమంత్రి కేసీఆర్.


