16.7 C
Hyderabad
Sunday, February 8, 2026
spot_img

వరద సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

ఏపీలో వరద సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉదయం నుంచి జరిగిన ఆహారం పంపిణీపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా విధుల్లో ఉన్న అధికారులు, ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు. 5 హెలీకాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ జరుగుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. హెలికాప్టర్లు, పడవులు, ట్రాక్టర్ల ద్వారా ఉదయం 6 గంటల నుంచి ఆహారం, నీళ్లు అందిస్తున్నామని వివరించారు. 5 లక్షల ఆహారం, నీళ్ళ ప్యాకెట్లు సిద్దం చేసి పంపిణీ చేసినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా 100 శాతం ఆహారం పంపిణీ జరగాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు . NDRF బృందాలు చేరుకోలేని చోటకు హెలీకాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం అందించాలని సూచించారు. మూడు పూటలా ఆహారం అందించాలని.. 36 డివిజన్లలో ఆయా ప్రాంతాల్లో విధుల్లో ఉన్న అధికారులే ఆహార పంపణీకి బాధ్యత వహించాలని చెప్పారు. క్షేత్ర స్థాయిలో ఆహారం అందిందీ లేనిదీ నిర్థారించుకోవాలన్నారు చంద్రబాబు. రెండు రోజులు వరదలో చిక్కుకుని ఆహారం, నీరు లేక పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకుని అధికారులు పనిచేయాలని చెప్పారు. మన కుటుంబమే అలాంటి కష్టంలో ఉందనే ఆలోచనతో అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు పనిచేయాలని సూచించారాయన. నీరు తగ్గుతున్న ప్రాంతాల్లో పారిశుధ్య పనులకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్