21.6 C
Hyderabad
Sunday, September 28, 2025
spot_img

నిలకడగా కిషన్ రెడ్డి ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి(58) ఆరోగ్యం నిలకడగానే ఉందని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు తమ పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని ప్రకటించారు. కాగా చాతిలో నొప్పి కారణంగా ఆదివారం రాత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. కార్డియోన్యూరో సెంటర్‌లోని కార్డిక్‌ కేర్‌ యూనిట్‌లో పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నట్లు నిర్థారించారు. అందుకు తగ్గట్లుగా ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా 2019 లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కిషన్ రెడ్డి ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్