స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వేగంగా వస్తున్న కారు, లారీని ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు హర్షిత, అంకిత, అమృత్, నితిన్గా గుర్తించారు. ప్రమాదసమయంలో కారులో మొత్తం 12 మంది ఉన్నట్టు తెలుస్తోంది. కారులో ఉన్న మరో 8 మందికి తీవ్రగాయాలు కావడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం గండిపేట మండలం ఖానాపూర్లో జరిగింది. మృతులంతా నిజాంపేట్కు చెందినవారిగా గుర్తించారు. వీరంతా బ్యాచిలర్ పార్టీ కోసం ఒకే కారులో 12 మంది వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.