కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీటెక్ రవి నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ ఆఫీసు నుంచి భారీ ర్యాలీగా వచ్చి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజే శారు. చంద్రబాబు కుప్పంలో భారీ మెజార్టీతో గెలుస్తారని బీటెక్ రవి తెలిపారు. పులివెందుల ప్రజలు తమకు స్వచ్చందంగా మద్దతు తెలుపుతున్నార న్నారు. పులివెందులలో అధికారులను అడ్డు పెట్టుకో కుండా, ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడకుండా వైసీపీ గెలవగవదా అని ప్రశ్నించారు. ప్రజలంతా టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని బీటెక్ రవి కోరారు.