కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చినప్పుడే ఆ మేనిఫెస్టోపై ముస్లిం లీగ్ ముద్ర ఉందని అదే రోజు చెప్పానని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. చత్తీస్ గఢ్ లోని సుర్గుజాలో విజయ్ సంకల్పయాత్ర మహార్యాలీ సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మీద మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని తయారు చేస్తున్నప్పుడు బాబా సాహెబ్ అంబేడ్కర్ నాయకత్వంలో భారతదేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండరాదని నిర్ణయించారన్నారు. కానీ ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఈ మాటలను పట్టించు కోలేదని, విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ తో సహా పలు చోట్ల కాంగ్రెస్ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసేందుకు యత్నించిందని మోదీ ఆరోపించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మత ప్రాతి పదికన రిజర్వేషన్ల అమలుకు సిద్ధమయిందని ప్రధాని ఆరోపించారు. అంతేకాక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటాను గండి కొట్టేందుకు యత్నిస్తోందని ఆయన అన్నారు.