21.5 C
Hyderabad
Sunday, September 28, 2025
spot_img

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడికి రిమాండ్

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఉదయ్ ని శనివారం కస్టడీకి తీసుకోనున్నారు సీబీఐ అధికారులు. ఇవాళ ఉదయం కడప జిల్లాలోని పులివెందులలో ఉదయ్ కుమార్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కడప సెంట్రల్ జైలులోని గెస్ట్ హౌస్ లో కాసేపు విచారించిన అధికారులు హైదరాబాద్ తరలించారు. తాజాగా సీబీఐ కోర్టులో ఉదయ్ ని హాజరుపర్చడంతో న్యాయస్థానం 14రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. కాగా వివేకా హత్య జరిగిన రోజు ఎంపీ అవినాశ్ తో పాటు ఘటన స్థలంలో ఉదయ్ ఉన్నట్లు గూగుల్ టేకౌట్ ద్వారా అధికారులు గుర్తించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్